మన్యం న్యూస్, ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆరో వార్డు నందమూరి నగర్ కాలనీకి చెందిన ఉమ గాని రమేష్ కు సీఎం సహాయ నుండి మంజూరైన 35000/ రూపాయల విలువగల చెక్కును ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం బి ఆర్ ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా ఆధ్వర్యంలో సోమవారం రమేష్ కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి సలీం, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రామ నర్సయ్య,ఎంపీటీసీ సభ్యురాలు కుమ్మరి స్వప్న చంద్రబాబు,వార్డు మెంబర్ జాడి స్వప్న భోజరావు, ధనపునేని కిరణ్,బట్టు రమేష్, గార ఆనంద్,కొండాయి చిన్ని, కందకట్ల శ్రీనివాస్,కాళ్ళ రామకృష్ణ,పాలకుర్తి విజయ్, అశోక్,సర్వర్,సతీష్,సమ్మయ్య,చింతకింది రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: