వైరా: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం వైరా మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా వైరా పట్టణం, ముసలిమడుగు, నారపనేనిపల్లి, రెబ్బవరం, గొల్లపూడి, జింకలగుడిశ, గరికపాడు తదితర గ్రామాలను సందర్శించారు. వైరా పట్టణంలో మూడు కుటుంబాలను పరామర్శించారు. ముసలిమడుగులో నర్వనేని మల్లేశ్వరి చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. నారపనేనిపల్లిలో యరమల కరుణాకర్రెడ్డి అమ్మ చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. రెబ్బవరంలో, జింకల గుడిశలో పలు కుటుంబాలను పరామర్శించారు. గొల్లపూడిలో యలగొండ శ్రీను, వరికూటి బాయమ్మలు చనిపోగా వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. గరికపాడులో పలు ప్రయివేటు కార్యక్రమాలకు హాజరైయ్యారు. ఇటీవల జరిగిన ఓ వివాహ నూతన జంటను ఆశీర్వాదించి నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు.
Post A Comment: