CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించిన కొత్తగూడెం డిఎస్పీ వేంకటేశ్వర బాబు

Share it:




మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25..జిల్లా ఎస్పీ డా.వినీత్.ఆదేశానుసారం పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం పోలీస్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు  పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని వారికి భరోసా కల్పించారు.చుంచుపల్లిలో నివాసముంటున్న పోలీసు అమరవీరులైన కానిస్టేబుల్ చందన్ కుమార్  కుటుంబ సభ్యులను  పరామర్శించారు.  పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమను సంప్రదించవచ్చని అన్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రస్తుతం సమాజంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు.


ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎస్సై శ్రీనివాస్,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు  సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: