CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడుసాగుదారులు సంపూర్ణ సహకారం అందించాలి. పోడు సాగుదారులకు సర్వే పత్రాలు అందజేసిన సర్పంచ్ కొమరం విశ్వనాథం

Share it:


మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోడు భూములకు అట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పోడు భూముల పట్టాల కొరకు దరఖాస్తు చేసుకున్న పోడు సాగుదారులకు సర్వే కాగితాలు, భూ సర్వే కు వచ్చిన అధికార యంత్రాంగానికి పోడు సాగుదారులు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని తాటిగూడెం గ్రామంలో పోడు సాగుదారులకు స్థానిక సర్పంచ్ కొమరం.విశ్వనాథం,ఫారెస్ట్ బీట్ అధికారి.శివ,సెక్రటరీ. వీరన్న, పోడు సాగు దారులకు సర్వే పారాలు అందజేశారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన ఆదివాసి ప్రజల పట్ల ప్రత్యేక అభిమానంతో వారు గత కొన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని తీసుకున్న నిర్ణయం ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. అధికారులు భూ సర్వే చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు పోడుసాగుదారులు అధికార యంత్రాంగానికి పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడి.నాగరాజు, పోడు సాగుదారులు చందా.శ్యామ్, దుర్గం.ముసలయ్య, కొమరం. కాంతారావు,పాపారావు, పోలెబోయిన.వెంకట్ నారాయణ,పోడు సాగుదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: