CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మత్స్య సంఘాల బలోపేతమై ప్రభుత్వ లక్ష్యం... : ఉచితంగా చేప పిల్లల పంపిణీ...

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ : మృత్య సంఘాల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఉచితంగా నూరు శాతం సబ్సిడీపై చేపపిల్లలను ప్రభుత్వం అందిస్తోందని ఎంపీపీ బానోత్ పార్వతి, జిల్లా మత్స్యశాఖ అధికారి బానోతు వీరన్న అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన చేప పిల్లల పంపిణీని వీరు ఇరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1. 80 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయటమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అన్నారు జిల్లాలో 686 చెరువులు 77 పెద్ద తరహా చెరువులు 3 రిజర్వాయర్లలో చేపలు పిల్లల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉచిత చేప పిల్లల పథకాన్ని సద్వినియోగం చేసుకొనిఆయా కుటుంబాలు సంఘాలు బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, మద్దుకూరు మత్యకారుల సంఘం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: