మన్యం న్యూస్ ,గుండాల ,అక్టోబర్ (22): తుడుం దెబ్బ నూతన మండల కమిటీని శనివారం ఎన్నుకున్నారు మండల అధ్యక్షునిగా గోవిందా నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా చింత వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ మండలంలో 1/70 ఫేస చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పోడు భూముల సర్వేలో నిబద్ధతగా చేసి అర్హులందరికీ పట్టాలి ఇవ్వాలని వారు కోరారు. మండల కేంద్రంలో మినీ ఏటీఎంల దందా జరుగుతుందని అమాయక గిరిజనుల ఖాతాల నుండి నిర్వాహకులు పెద్ద ఎత్తున స్వాహా చేస్తున్నారని అలాంటి వారిపై నిగా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులుపూనేం శ్రీనివాస్, వజ్జ ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: