మన్యం న్యూస్ , గుండాల, అక్టోబర్ (22) : రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అని ఉండాల సిఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమానికి గుండాల మండలం నుండి పోలీస్ శాఖ వారితో పాటు యువత పెద్ద ఎత్తున తరలి వెళ్లి రక్తదానం గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, కానిస్టేబుల్స్ వెంకట్, రాంబాబులు రక్తదానం చేశారు. మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త కొప్పుల జీవన్ సైతం రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు
Navigation
Post A Comment: