మన్యం మనుగడ, ఏటూరు నాగారం :
మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కొలువై ఉన్న దుర్గామాత అమ్మవారు శనివారం లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రూ.5.36 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు యల్లప్రగడ నాగేశ్వర్రావుశర్మ లలిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు చేయించారు. నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు.
Post A Comment: