జూలూరుపాడు, అక్టోబర్ 1, (మన్యం న్యూస్ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక "బతుకమ్మ పండుగ" పండుగ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు మొదలుకొని మారుమూల పల్లెల వరకు గత నెల 25 నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం జూలూరుపాడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండిఓ తాళ్లూరి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తీరోక్క పూల తోటి సుందరంగా బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతోటి బతుకమ్మ ఆటపాటలతో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు అలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, జడ్పిటిసి భూక్య కళావతి, వెంగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి, ఎంపీఓ రామారావు, పంచాయితీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: