మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లను 6 నుండి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33 జారిచేయడం పట్ల టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు వట్టం రాంబాబు హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు మణుగూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 33 జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.గిరిజనుల ఎన్నో ఏళ్ల కల 10% రిజర్వేషన్ అని అందుకు కృషిచేసిన ప్రభుత్వ విప్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలియజేశారు.త్వరలోనే గిరిజనులకు పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తారని,అందుకు సంబంధించిన జిల్లా కమిటీ ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.త్వరలోనే పోడు భూములకు పట్టాల పంపిణీ కూడా చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని వారు పేర్కొన్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు వ్యక్తిగత సహాయకులు చందా హరికృష్ణ, బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్,ఎస్టీ సెల్ అధ్యక్షులు సకిని బాబురావు,తోగ్గుడెం సర్పంచ్ బోగ్గం.రజిత,పార్టీ నాయకులు గణేష్,రమేష్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: