CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చరిత్ర లిఖించే సత్తా కేసీఆర్ దే : పోతురాజు రవి

Share it:



  • చరిత్ర లిఖించే సత్తా కేసీఆర్ దే : పోతురాజు రవి 
  • ఎస్టిలకు 10 శాతం రిజర్వేషన్ల పెంపు పట్ల హర్షం వ్యక్తం 
  • కొత్తగూడెంలో సీఎం కెసిఆర్, ప్రభుత్వ విప్ రేగా చిత్రపటానికి పాలాభిషేకం


మన్యం న్యూస్, జిల్లాప్రతినిధి, అక్టోబర్01..దళితులు, గిరిజనులు కేసీఆర్ కు రెండు కళ్ళ లాంటివారని రేగా యూత్ సభ్యులు పోతురాజు రవి  కొనియాడారు. ఎస్టీల రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచిన సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడంపై దేశ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలు అందరికి తెలుసని అన్నారు. సిఎం కేసీఆర్ గిరిజనుల దళిత పక్షపాతి అన్న పేరు సార్థకం చేసుకున్నారని అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవో జారీ చేసి అమలు ప్రారంభిస్తున్నారని, ఆదివాసి గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. భూమిలేని గిరిజనులకు గిరిజన బందు అమలు చేస్తామని ప్రకటించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, సందీప్, అలీ, మధు, సాయి, జోషి, అఫ్రోజ్, భాను, నవిన్, నరేశ్, షారుఖ్, చందు,  కిట్టు, లడ్డు, సోను, ఇమ్రాన్, బబ్బి, గోల్డి శివాని , లక్కీ, రోశిని, పండు, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: