మన్యం న్యూస్, బూర్గంపాడు, అక్టోబర్ 29:
మండలంలోని మొరంపల్లి బంజర్, సంజీవ రెడ్డిపాలెం బూర్గంపాడు, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గౌతాపురం,లక్ష్మీపురం తదితర గ్రామాలలో నాగుల చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. నాగుల చవితి పండగను పురస్కరించుకొని మహిళలు శనివారం తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి అలంకరణప్రాయంగా తాంబూలాల్లో పూలు, పండ్లు,గుడ్లు తీర్థ ప్రసాదాలతో అందుబాటులో ఉన్న పుట్టలకు పాలు పోస్తూ దీపారాధన చేస్తూ తమ కోరికలు తీరాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ...
సర్వ రోగాలు, సమస్త దోషాల నివారణకు నాగుల చవితి పూజలు
నాగల చవితి పండుగ రోజున నాగ దేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు. అంతేకాదు నాగుల చవితి నాడు నాగదేవతను ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అన్నారు.
Post A Comment: