మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 29 : మండల వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నాగులచవితిని భక్తులు జరుపుకున్నారు. శనివారం మద్దుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గల నాగులపుట్టకు భక్తులు పాలు పోసి పూజలు చేశారు. మండల వ్యాప్తంగా గల నాగులపుట్టలకు నాగులచవితి రోజున పాలు పోసి, పూజలు చేయటం వల్ల సంతాన సమస్యలు తీరుతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం, నాగులచవితి సందర్భంగా ఆలయాలలో భక్తులు కిటకిటలాడారు . మద్దుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Navigation
Post A Comment: