మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి చదివే చరణ్ అనే విద్యార్థి ని చావ గొట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఘర్షణ కు దిగారు. రెండు రోజుల క్రితం ఈ గురుకులంలో భోజనం బాగోలేదని మెనూ ప్రకారం ఫుడ్ పెట్టే ఏర్పాటు చెయ్యాలని ఓ ఇద్దరు విద్యార్థులు మీడియా ముందు చెప్పారు. ఈ ఇద్దరు మీడియా ముందు నోరు విప్పడానికి చరణ్ కారణమని తెలుసుకున్న కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు చరణ్ ని పిలిపించి కిందపడేసి కొట్టాడని, గోడకేసి నెట్టివేసాడని చరణ్ తన తండ్రికి కాల్ చేసి చెప్పడంతో చరణ్ తండ్రి స్కూల్ కి వచ్చి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్థానిక పెద్దలు సర్దిచెప్పడం సరిపోతుంది. అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవ్వడంతో విద్యార్థులకు కనీసం సరైన భోజనం కూడా కరువయ్యిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి సదరు టీచర్ పై చర్యలు తీసుకుని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Navigation
Post A Comment: