మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల గ్రామానికి చెందిన సల్లూరి. గంగమ్మకు 23 వేల రూపాయల విలువ గల చెక్కును టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య బాధితురాలికి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కు ద్వారా అందించే ప్రోత్సాహకం పేదలకు ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యంగా సెం కెసిఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న.అశోక్ కుమార్,స్థానిక సర్పంచ్ జవ్వాజి.రాధ,ఎంపిటీసి కొమరం.మునీంద్రా,ఎస్సీ సెల్ అధ్యక్షులు. నిట్టా. ఏడుకొండలు, ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం.రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: