మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన పడిగ స్వరూప, గత కొంతకాలం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న గడ్డంపల్లి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో పద మూడు వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆదివాసీ ఉద్యోగ సంఘ డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్, వార నరసింహారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: