మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్ ( 26) : ప్రజా పందా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటో తారీఖున నిర్వహించబోయే అమరవీరుల సంస్కరణ సభ పోస్టర్ను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం కొత్తగూడెం డివిజన్ నాయకులు మాచర్ల సత్యం గుండాల సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న లు మాట్లాడుతూ ఎందరో అమరవీరులు ఉద్యమం కోసం హసువలు భాషారని అన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం తమ విలువైన ప్రాణాలను సైతం అర్పించారని అన్నారు. ఎందరో నాయకులు 50 ఏళ్ల ప్రజా ఉద్యమ చరిత్రలో కొవ్వొత్తిలా కరిగిపోయి ప్రజలకు సేవలు అందించారని అలాంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు జగన్, తెల్లం రాజు, సనప కుమార్, కొమరం శ్రీను, ఎనుగంటి గణేష్ , పుష్ప రాజ్, ఈసం కృష్ణ , పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృద్వి, డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: