మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 26 : అంగన్ వాడీలు సమయపాలన పాటించాలని సిడిపిఓ నిర్మలా జ్యోతి అన్నారు. బుధవారం స్థానిక సిడిపిఓ కార్యాలయంలో జరిగిన సెక్టర్ మీటింగ్ లో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు చెందిన అంగన్ వాడి టీచర్ల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రతి అంగన్ వాడి కేంద్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలలో చెత్త, మురుగునీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు ప్రమాదభరితమైన వస్తువులను దూరంగా ఉంచాలన్నారు. ముందస్తు అనుమతులు లేకుండా కేంద్రం మూయటం, సెలవులు పెట్టడం చేయవద్దన్నారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాణి,శకుంతల,లక్ష్మీ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: