మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గొట్టెల్ల ఏడూళ్ళ బయ్యారం గ్రామాలలో వరి కోతలను వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చలికాలం సమీపిస్తున్నందున రైతులు ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు సమయానికి ఎటువంటి తేమ లేకుండా లేకుండా చూడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
Post A Comment: