మన్యం న్యూస్, అశ్వారావుపేట:
మండల పరిధిలోని వాగొడ్డుగూడెంలో పోడు సాగుదారులకు అటవీ క్షేత్ర అధికారులకు వాగ్వాదం జరిగిన సంఘటన విధితమే అయితే విషయం తెలుసుకున్న సిపిఐఎంఎల్ ప్రజాపందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి ప్రభాకర్, అమర్లపూడి రాము సోమవారం రోజు వాగొడ్డుగూడెం పోడు వ్యవసాయదారులు నేరుగా కలిసి జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడుసాగుదారులు పట్ల దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒకప్రక్క పోడు భూములకి పట్టాలు ఇస్తామంటూనే, మరో ప్రక్క పోడు సాగుదారులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్య అని దీని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వాళ్లు తెలిపారు. అనంతరం పోడు సాగు చేసుకుంటున్నా ఆదివాసీల దగ్గర వివరాలు సేకరించి పోడు భూములకి పట్టా వచ్చేంతవరకు సిపిఐఎంఎల్ ఉద్యమాలు నిర్వహించి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
Post A Comment: