CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమురం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి .

Share it:

 


  • కొమురం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి .
  • వర్ధంతికి జిల్లా కు రూ.కోటి రూపాయలు నిధులు కేటాయించాలి.
  • తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు డిమాండ్ 

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03.. కొమురం భీం వర్ధంతి అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాకు రూ కోటి రూపాయలు కేటాయించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం లో సోమవారం

ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) ఆద్వర్యంలో బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ పోరాట యోధుడు, ఆదివాసీ హక్కుల కోసం నిజాం సర్కార్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా  జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసి అమరుడైన ఆదివాసీ ఆరాధ్యదైవం ,గోండు వీరుడు కొమురం భీం 82 వ వర్ధంతి ని ఈ నెల 9 వ తేదీ నుంచి 15 వరకు వారోత్సవాలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిచాలని, డిమాండ్ చేశారు అందులో భాగంగా భద్రాద్రి జిల్లాకు రూ.ఒక కోటి రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డివిజేన్ అధ్యక్షులు పాయం లక్ష్మినర్సు,ఉపాధ్యాక్షులు బాడిస మోహన్,లక్ష్మిదేవి పల్లి మండల అధ్యక్షులు వర్స నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: