మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 27: కార్తీకమాసం సందర్భంగా దామరచర్ల గ్రామానికి చెందిన 50 మంది రామభక్తులు భద్రాచలంకు పాదయాత్రను చేపట్టారు. గురువారం ఉదయం 9 గంటల నుండి గ్రామం నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా రామభక్తులు మాట్లాడుతూ... గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు పండాలని, సకలజనుల కోసం పాదయాత్రను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామస్తులు భద్రాచలంకు పాదయాత్ర చేసే రామభక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Navigation
Post A Comment: