మన్యం న్యూస్, ఏటూరు నాగారం ;
ఏటూరు నాగారం మండల గోగు పల్లి గ్రామ మహాసభ ఎండి యాకూబ్ అధ్యక్షతన జరిగింది. ఈ మహా సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు సామ చంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ 28 అక్టోబరు 2022న చిన్న బోయిన పల్లి గ్రామంలో జరుగుతుందని,ఈ మహాసభకు మండలంలో ఉన్నటువంటి రైతులు రైతు సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోపల ఉన్నటువంటి అనేక రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని వరి ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు ఎన్ని కిలోల తరుగు తీస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఎలాంటి తరుగు తీయకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మండలంలో ఉన్నటువంటి భూ సమస్య మొత్తం పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పొడు భూముల సర్వే పారదర్శకంగా జరగాలని సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు అక్కుపత్రాలు ఇచ్చి రైతుబంధు కిసాన్ సామ్మాన్ నిధులు ఇవ్వాలని, తెలంగాణ రైతు సంఘం మండల మహాసభలో మండలం లోపల ఉన్నటువంటి అనేక రైతాంగ సమస్యలను తీసుకొని చర్చించి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు మండల రైతాంగానికి తెలంగాణ రైతు సంఘం అండగా నిలబడి రైతంగ సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తుందని,ఈ మహాసభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం గోగుపల్లి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కనుకుల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా గుడుగుట్ల భీమయ్య, ప్రధాన కార్యదర్శిగా కత్తి ప్రేమ్ సాగర్, సహాయ కార్యదర్శిగా ఎలుకపల్లి శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా పూణేం రమేష్, వై సమ్మిరెడ్డి ,జై మల్లారెడ్డి, జి సారయ్య,కోటేశ్వరరావు, కే ధర్మసాగర్,ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు వడకాపురం సారయ్య, మండల కార్యదర్శి ఎండి యాకూబ్ తో పాటు 26 మంది రైతులు పాల్గొన్నారు.
Post A Comment: