మన్యం న్యూస్, అక్టోబర్ 27,వాజేడు :.
వాజేడు మండల కేంద్రంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆదేశాల మేరకు ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుసుమ జగదీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు, పిలుపు మేరకు బిజెపి పార్టీ నాయకులు కలిసి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర పన్నింది దీనిని నిరసిస్తూ వాజేడు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాప చెట్టు సెంటర్లో బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, మాట్లాడుతూ నిన్న జరిగిన బిజెపి కుట్రలో భాగంగా మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పైలెట్ రోహిత్ రెడ్డి,రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, వీరం హర్షవర్ధన్ రెడ్డి, ఒక్కొక్కరికి 100 కోట్లతో కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు జడ్పిటిసి తల్లడి పుష్పలత సర్పంచులు జజ్జరి మేనక, పాయం జయలక్ష్మి, యాలం శివరామకృష్ణమరాజు,ఉపసర్పంచులు,గౌరారపు కోటేశ్వరరావు,సుగందపు సాంబశివరావు, మండల కో, ఆప్షన్ సభ్యులు షేక్ నిజాముద్దీన్,మండల బిఆర్ఎస్ నాయకులు కొత్తగట్టు సాంబమూర్తి తల్లడి నానుబాబు పాయం జానకి రమణ తాతారావు, జజ్జరి సత్యనారాయణ, తల్లడి వెంకటేశ్వరరావు,చెన్నం సాంబశివరావు అశోక్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: