CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పడక తప్పదు : టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్

Share it:


మన్యం న్యూస్, గుండాల , అక్టోబర్(27) : మోడీ నిరంకశపాలనకు చరమగీతం పాడక తప్పదని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలనుసారం గురువారం మండల కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి అనంతరం మండల అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ మునుగోడులో భయంతోనే బిజెపి పార్టీ ఇలాంటి వాటికి తెరలేపిందన్నారు. బిజెపి అధికారంలోని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడి ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రానున్న రోజుల్లో బిజెపి భూస్థాపితం కాక తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, లింగాగూడెం సర్పంచ్ నరసింహారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాములు, బీసీ సెల్ మండల అధ్యక్షులు రమేష్ , యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, మైనారిటీ అధ్యక్షులు సుభాని, మండల అధికార ప్రతినిధి టి రాము, గోగల్ల లక్ష్మీనారాయణ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ నబీ, కీసరి వీరన్న, బొమ్మెర్ల సతీష్ , కృష్ణ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: