మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 22... ఆపదలో ఉన్న వారికి అవసరమైన చోట సకాలంలో రక్తదానం చేసి వారికి పునర్జన్మ ఇచ్చేందుకు ప్రతి యువత కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. శనివారం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైనది. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ పిలుపునిచ్చిన వెంటనే రక్తదానం చేసేందుకు స్వచ్ఛంగా కదిలి వచ్చిన యువతను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. పోలీసులు అంటే స్నేహితులని సమాజహితం కోరే సన్నిహితులు మని ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలుపరుస్తున్న మన్నారు. ప్రజాసంక్షేమం కోసం దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు లకు ఘన నివాళులు అర్పించారు. అంకితభావంతో పని చేసి అసువులు బాసిన పోలీసుల కృషి చిరస్మరణీయంగా నిలిచి పోయిందన్నారు. మెగా రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది యువకులు రక్తదానం చేయడం ఎంతో గర్వకారణమన్నారు. సమాజంలో యువత చెడు మార్గంలో పై నుంచి కాకుండా దేశ సంక్షేమం కోసం సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు సిఐలు రమాకాంత్, రాజు, సత్యనారాయణ డివిజన్ పరిధిలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: