మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 22....ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 76 ననుసరించి ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పారదర్శంగా నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో స్వర్ణలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి స్థలాల క్రమబద్ధీకరణలో ప్రజలు దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఎవరైనా ప్రజలను పట్టాలిప్పిస్తామని డబ్బులు అడిగినట్లయితే కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392919750 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని ఆమె సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి విషయంలో ప్రజలకు ఎలాంటి సందేశాలు, సలహలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయ పనివేళ్ళల్లో ఫోన్ చేయొచ్చునని ఆమె సూచించారు. క్రమబద్ధీకరణ పట్టాలు ఇప్పిస్తామని ప్రజలను మభ్యపెట్టే వారిపై పోలిస్ కేసులు నమోదు చేసి, చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Navigation
Post A Comment: