మన్యం న్యూస్, అశ్వరావుపేట: మండల పరిధిలోని, నారాయణపురం గ్రామంలో జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి మావయ్య చిన్నంశెట్టి శోభనాద్రి శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి స్వగృహం వద్ద ఉంచిన చిన్నంశెట్టి శోభనాద్రి యొక్క భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి, జడ్పిటిసి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నిర్మల పుల్లారావు, అబ్దుల్ జిన్నా, నులకని శ్రీను, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: