CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన మండల అధ్యక్షుడు గా రామవరపు హిమగిరి..

Share it:


మన్యం న్యూస్ , దుమ్ముగూడెం ::


మండలంలోని లక్ష్మీ నగరం గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. దుమ్ముగూడెం మండల నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షునిగా రామవరపు హిమగిరి ఉపాధ్యక్షులుగా పూడికపల్లి ప్రేమ్ కుమార్ కార్యదర్శి కరుణాకర్ గౌరవ అధ్యక్షులు రాము కోశాధికారిగా సుంకర ప్రసాదు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నాయి బ్రాహ్మణ కు హామీలు నెరవేర్చాలని లానే వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాబోయే బడ్జెట్లో 250 కోట్లు విడుదల చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని తెలిపారు కులం పేరుతో దుర్భాషలాడిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టి జీవో తీసుకురావాలని అన్నారు కళ్యాణ కట్ట లో పనిచేసే వృత్తిదారులను పర్మెంటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: