మన్యం న్యూస్ గుండాల:(06) సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ ప్రజలకు సూచించారు. గురువారం మండలం పరిధిలోని సాయనపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సైబర్ నేరగాండ్లు బ్యాంకు వ్యక్తులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మీ డబ్బులను చోరీ చేసే ప్రమాదం ఉందన్నారు. టెక్నాలజీ యుగంలో ఎవరు ఎక్కడనుండి డబ్బులను చోరీ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం అన్నారు. ఎవరైనా చరవాణిలో మీ బ్యాంకు సమాచారాన్ని అడిగితే ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: