మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ: పార్టీ పటిష్టతపై గ్రామస్థాయిలో కృషి చేయాలని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు తనయుడు మెచ్చా రాము, మేనల్లుడు తాటి ప్రదీప్ లు సూచించారు. గురువారం రవికంపాడు గ్రామాన్ని ఇద్దరూ సందర్శించి స్థానిక నాయకులతో కలిసి పార్టీ పట్టిష్టతపై సమీక్షించారు. తొలుత గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరును ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు,జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూపతి రమేష్,సర్పంచ్ భానోత్ రన్యా, గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, నాయకులు గాదె శివప్రసాద్, మద్దిరాల చినపిచ్చయ్య,డోజర్ నరసింహారావు, కళ్లెం వెంకటేశ్వర్లు, ఎండి సలీం, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: