మన్యం న్యూస్, కరకగూడెం:భారత సమాజాన్ని కంటికి రెప్పల కాపాడుతు,శాంతి భద్రతల కోసం నీరంతరం పాటు పడుతు విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలిస్ లకు ఘన నివాళులు అర్పించిన కరకగూడెం ఎస్ఐ జీవన్ రాజు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల నుండి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కాపాడుతు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరం అన్నారు.ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీస్ ఒక్కరే మేల్కొని శాంతి భద్రతల,పరిరక్షణ నిమ్మితం కపాలకాస్తు ఉంటున్నది ఒక్క పోలీస్ లే అన్నారు.ఎండ,వన,పగలు రాత్రి తేడాలేకుండా కుటుంబంతో కలసి జరుపుకొనే పండగలను వదిలేసి ప్రజలకోసం జీవించి,ప్రాణాలను ప్రాణంగా పెట్టి ప్రజలకోసం పోలీస్ లు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపడం మనందరి బాధ్యత అన్నారు. అలాగే అక్టోబర్ 21 అంటే ఇది పోలీస్ ల అమరల సంస్కరణ దినోత్సవం,1959వ సంవత్సరంలో చైన దూరక్రమణను భారతీయ సైన్యం సమర్థంగా తిప్పికొట్టి ఎంతోమంది పోలిసులు వీర మరణం పొందిన రోజు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పాపయ్య,రైటర్ దుర్గరావు,ఏఅర్,స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: