మన్యం న్యూస్, కరకగూడెం: మండల పరిధిలోని నర్సంపేట (కాలనీ) గ్రామంలో జరిగిన పోడు భూముల సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ రఘునాథపాలెం గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సంపేట (కాలనీ) గ్రామంలో జరిగిన పోడు భూముల సర్వేలో పాల్గొని సర్వేను పరిశీలించడం జరిగిందన్నారు. రైతు సంక్షేమం కోసం పెదపిట వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు అమల చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాధపాలెం సర్పంచ్ పోలబోయిన నరసింహారావు,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పాయం.నరసింహరావు,బిఅర్ఎస్ పార్టీ మండల ఉపాద్యక్షులు బుడగం. రాము,ఎప్అర్ సి కమిటీ చైర్మన్ పి.నరసింహరావు,ఫారెస్ట్ బిట్ అఫిసర్ బి.అశోక్, సెక్రటరీ రామకృష్ణ రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: