CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సైబర్ సురక్షిత - జాతీయ భద్రత.. కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీస్ శాఖ..

Share it:


జూలూరుపాడు , అక్టోబర్ 21, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో జూలూరుపాడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సైబర్ సురక్షిత - జాతీయ భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు సమాజంలో అనేక రూపాలలో ఉన్న నేరగాళ్లు బాలికలు, మహిళల పై జరుపుతున్న దాడులు, అఘాయిత్యాలను విద్యార్థులకు వివరించారు. బాలికా సాధికారత, సైబర్ అవేర్ నెస్, చైల్డ్ అబ్యూజ్, ఉమెన్ సేఫ్టీ, దిశా అప్లికేషన్, బాల్య వివాహాలు,  ఒంటరిగా బయటికి వెళ్లినప్పుడు ఊహించని సంఘటన సంభవిస్తే క్షణాల్లో పోలీస్ శాఖకు సమాచారం అందించి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సైదమ్మ, పిసి శ్రీలత పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: