మన్యం న్యూస్, గుండాల/ఆళ్లపల్లి (11): మండలంలోని అర్హులందరికీ పోడు పట్టాలు ఇవ్వబడుతుందని ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం మంగళవారం మండలం పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామంలో అటవీశాఖ నిర్వహిస్తున్న పోడు సర్వే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పోడు రైతులను పట్టాలిస్తామన్న మాట ప్రకారం సర్వే నిర్వహించడం జరుగుతుందని ఇందులో గుర్తించిన పోడు రైతులందరికీ పట్టాలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. మండలంలోని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఖయ్యూం, నరెడ్ల ప్రవీణ్ కుమార్, నాగేశ్వరరావు, హరికృష్ణ , అశోక్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: