మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు మా రాయగూడెం గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ సోందే అర్జమ్మ అనారోగ్యంతో మరణించడం సిపిఎం పార్టీకి తీరని లోటని మాజీ డిసిసిబి చైర్మన్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి రవికుమార్ అన్నారు లచ్చిగూడెం గ్రామంలోని తన స్వగృహంలో వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జమ్మ మారాయిగూడెం ఉమ్మడి గ్రామపంచాయతీ వార్డు మెంబర్గా చేసి గ్రామంలోని అభివృద్ధి పనులకు ముందుండి పనిచేశారని మహిళా సంఘం నాయకురాలుగా సిపిఎం పార్టీ కార్యకర్తలను స్ఫూర్తిదాయకంగా పనిచేసిన అమరజీవి కామ్రేడ్అర్జమ్మ అని గుర్తు చేశారు అందరూ కామ్రేడ్ అర్జమ్మ స్ఫూర్తితో పని చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య మండల కార్యదర్శి వర్గ సభ్యులు బొల్లి సూర్యచంద్రరావు సర్పంచ్ రాజమ్మ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి తిరుపతిరావు ఎంపీటీసీ పెనుబల్లి సీతమ్మ మాజీ సర్పంచ్ అర్జున్ ఏపీ చిత్తూరు సిపిఎం మండల కార్యదర్శి సురేష్ లక్ష్మయ్య చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: