మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (14) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చరమగీతం పాడక తప్పదని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం వేములపల్లి వెంకటరామయ్య, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు మాట్లాడుతూ. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ రైతుల మనుగడకే ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తుందన్నారు. అడవి సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి గిరిజనులను అడవి నుండి పంపించాలని చూస్తున్నారని వారు అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే దేశ ప్రజలకు పెను ప్రమాదం వాటిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలచంద్ర, గుండాల సర్పంచ్ సీతారాములు, జడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, సారంగపాణి, తుపాకుల నాగేశ్వరరావు, పరిశిక రవి, ఇరుప రాజేష్ , వై వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: