*చేపల ఉత్పత్తి తో గిరిజనులకు ఆర్థికంగా తోడ్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం
*ఎంపీపీ అంతటి విజయ.
*జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి.
*ఏటూరునాగారం మండలం
లోని 17 చెరువులకు 5 లక్షల 10 వేల చేప పిల్లల పంపిణీ.
మన్యం న్యూస్, ఏటూరు నాగారం:
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉచిత చేప
పిల్లలను తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ అన్నారు.మండలం లోని ఏజెన్సీ గ్రామ పంచాయతీ పరిధిలోని 85 చెరువులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో చేపల పెంపకానికి ఆంధ్ర పాలకులు దోహద పడలేదన్నారు.కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనుల్లో నీలి విప్లవం తో ఆర్థికాభివృద్ధి కి తోడ్పపడు తున్నదన్నారు.అంతే కాకుండా గిరిజనులకు పౌష్టికాహారం అందించే దిశగా ముందడగులు వేస్తుందన్నారు.జిల్లా మత్స్య శాఖ అధికారి పిల్లి శ్రీపతి మాట్లాడుతూ.మండలంలోని 9 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కు ,85 కుంటలు మరియు చెరువులకు 10 లక్షల చేప పిల్లలను పంపిని చేయడం జరిగింద
న్నారు.ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ మెంబర్ వలియాబి,
ఐటీడీఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్,ఎంపిడివో కుమార్,ఎంపీటీసీ కోట నర్సింహులు,స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్ అధికారి రమేష్ ,
వివిధ గ్రామాల పెసా
మోబిలైజర్స్,మత్స్య శాఖ సిబ్బంది కృష్ణ,సౌజన్య,వివిధ గ్రామాల సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: