మన్యం న్యూస్, దమ్మపేట, అక్టోబర్ 29 :
పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని సిపిఐ అనుబంధ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో దమ్మపేట ఉప.తాసిల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ 2002,2003,2004,2005 నుండి పోడు వ్యవసాయం చేస్తున్న నాగుపల్లి గ్రామపంచాయతీలో సుమారు 100 మంది పోడు రైతులు ఎన్నిసార్లు పోడు దరఖాస్తులు పెట్టుకున్న అధికారులు అనేక రకాల కుంటి సాకులు చెప్పి కాలాన్ని ఎల్లబుచ్చుతున్నారు రేపు 30వ తారీకు నాగుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పోడు రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి వారు పెట్టుకున్న పోడు దరఖాస్తులను పరిశీలించి భూములను సర్వే చేసి వారికి అప్పజెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగుపల్లి పోడు రైతులను ఏమాత్రం చిన్న చూపు చూసిన సర్వే చేయకుండా భూమి అప్పచెప్పకుండా ఉంటే సిపిఐ పార్టీ చూస్తా ఊరుకోదని వారి తరఫున మిలిటెంట్ పోరాటాలు చేసి వారికి ఆ భూమి సర్వే చేసి అప్పగించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్కే దస్తగిరి, మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, బత్తుల సాయి పోడు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: