CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన పోడు రైతుల అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ.. -గిరిజన పోడు రైతులను పరామర్శించిన జడ్పిటిసి...

Share it:


మన్యం న్యూస్, బూర్గంపాడు , అక్టోబర్ 31: మండలంలోని సోంపల్లి గ్రామపంచాయతీలో గల బుడ్డగూడెం గ్రామానికి చెందిన గిరిజన పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గత 20 సంవత్సరాలకు పైగా గ్రామపంచాయతీలోని బుడ్డగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే పోడు భూములో హరితహారం పేరుతో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నించిన సమయంలో గిరిజన పోడు రైతులు అటవిశాఖ అధికారులతో మేము అనేక సంవత్సరాలుగా ఇదే భూమిలో నమ్ముకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాము అని అధికారులకు చెప్పగా ఈ భూములు నీవే అయితే మొక్కలు నాటిన సరే మీ భూములు మీకే ఇస్తాం అని నమ్మబలికి అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో మొక్కలు నాటించారు. అప్పటినుండి పోడు రైతులు అటవీశాఖ  సిబ్బంది చిన్నచిన్న వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పోడు భూముల సర్వే చేస్తుండటంతో గిరిజన పోడు రైతులు మా భూములు సర్వే చేసి మాకు పట్టాలు ఇవ్వాలని సోమవారం నాడు పోడు రైతులు గట్టిగా నిలదీయడంతో మీ గ్రామాన్ని ఇక్కడ లేకుండా చేస్తాం ఏం చేస్తారో చేసుకొండని అటవీశాఖ అధికారులు బెదిరించి మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గిరిజన మహిళలు గాయపడ్డారు అదునుగా భావించిన అటవిశాఖ అధికారులు గ్రామ యువకుడిని కాళ్లు చేతులు కట్టి జీవుల్లో ఎక్కించుకొని వెళ్లిపోవడంతో దీన్ని గమనించిన గిరిజన పోడు రైతులు రెండు ట్రాక్టర్లతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లారు. తమపై దాడి చేసి, యువకుడిని ఎత్తుకెళ్లిన సంఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని వాపోయారు. విషయం తెలుసుకున్న బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హుటా హుటిన బంధిత బుడ్డగూడెం గ్రామానికి వెళ్లి గిరిజన పోడు రైతుల పరామర్శించి వారితో మాట్లాడి మీ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: