మన్యం మనుగడ, మంగపేట :
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలోనిరుపేద కుటుంబానికి చెందిన దుర్గం సమ్మయ్య 65 సం: తీవ్ర అనారోగ్యం తో గత కొంతకాలం గా బాధపడుతున్నాడు.వారికి వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబాన్ని కలిసి నగదు సహాయం శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన లంజపెళ్లి బక్కయ్య 60సం: ఒంటరిగా జీవిస్తున్నాడు,పనికి వెల్తేకాని పూట గడవని స్థితి,గత కొంతకాలంగా అనారోగ్యం గా వుండటం వలన స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి సమాచారం అందించగా ట్రస్ట్ చైర్మన్ ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు బాడిశనవీన్ ,ఇందారపు రమేష్, బాడిశ ఆది, కొమరం నితిన్, చౌలం సాయిబాబు, గట్టుపల్లి అర్జున్, కనుకుంట్ల నాగరాజు, రాజశేఖర్, జానపట్ల జయరాజు, బోడ ప్రవీణ్, గ్రామస్తులు కుందమల్ల రాంబాబు, బిలపాటి నరసింహారావు, తోట మల్ల అంజి, పూస వేణు, పూస ఉపేందర్, గోనె అంజి, బోడ నాగేష్, లంజపేల్లి స్వామి, లంజపెళ్లి శ్రావణ్, నంది సందీప్, బోడ నరసింహారావు, జాడి సాంబశివరావు, సీతారాములు, బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: