మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 79 వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వీఆర్ఏ లు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర మహిళా వీఆర్ఏ ల పిలుపు మేరకు అందరు కలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ నందు ఏర్పాటు చేసుకున్న మహా బతుకమ్మ కార్యక్రమానికి బయలుదేరిన మంగపేట మండల మహిళా వీఆర్ఏ లను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేసి ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది,ఇంతకంటే పిరికి పంద చర్య మరొకటి లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేత కాని తనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో హక్కులు కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమని అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఇట్టి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొనడం జరిగినది.
Post A Comment: