మన్యం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు.రాజ్యసభ సభ్యులు ఎంపీ బండి పార్థసారధి రెడ్డి ఈ నెల 17 వ తేదీ న సోమవారం ఖమ్మం జిల్లా వస్తున్న సందర్భంగా తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు వేలాది బైకులతో, కార్లతో, భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.18వ తేదీ మంగళవారం నాడు వారి స్వగ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరు కావాల్సిందిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు, నాయకులకు, ప్రజా ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీలు, తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
Post A Comment: