CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెండు బుల్లెట్లు దూసుకెళ్లినా.. ముష్కరులతో పోరాడి..!

Share it:



శ్రీనగర్‌: మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు మీదకు వచ్చినా వెనకడుగు వేయరు సైనికులు. వారి శిక్షణలో ఓ జాగిలం కూడా అదే తరహాలో తన నిబద్ధతను చాటుకుంది.తాజాగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య ఎన్‌కౌంటర్‌లో ఓ శునకం తీవ్రంగా గాయపడింది. అయినా దాని పోరాటం కొనసాగించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.దక్షిణ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. వారిని గుర్తించే పనిని జాగిలానికి అప్పగించారు. 'ఆ శునకం పేరు జూమ్‌. దానికి కఠిన శిక్షణ ఇచ్చాం. ఎంతో నిబద్ధత కలిగినది. గతంలో ఎన్నో ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఉంది' అని అధికారులు వెల్లడించారు.

'జూమ్‌ వారిని గుర్తించి.. దాడి చేసింది. ఆ క్రమంలోనే గాయపడింది. రెండు తుపాకీ గుండ్లు దూసుకెళ్లాయి. అయినా, దాని పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే ఘటనా స్థలానికి చేరుకున్న దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి' అని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జూమ్‌ను ఆర్మీకి చెందిన హాస్పిటల్‌కు తరలించరు..

Share it:

TELANGANA

Post A Comment: