మన్యం న్యూస్, కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం విద్యుత్ శాఖ ఏఈ గా నరేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఏఈ రామకృష్ణ ఇటీవల కాలంలో జరిగిన బదిలీలపై వెళ్లడంతో వారి స్థానంలో విద్యుత్ శాఖ ఏఈగా నరేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయనను విద్యుత్ శాఖ సిబ్బంది సాధారణంగా ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు వ్యవసాయపరంగా అన్నివేళలా విద్యుత్ సరఫరా చేస్తామని దీనికి రైతులందరూ సహకరించాలని, ప్రజలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు విన్నవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: