మన్యం న్యూస్, పినపాక:
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరుగుతున్న 24వ సిపిఐ జాతీయ మహాసభలకు సిపిఐ నాయకులు పినపాక మండలం నుండి భారీగా తరలి వెళ్లారు. ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులోని సిపిఐ కార్యలయం నుండి బయలుదేరిన వాహనాలకు సిపిఐ నాయకులు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం మనోహర చారి,పత్తిపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సాగిరాజు పధ్మనాభ రాజు,సహయ కార్యదర్శి గడ్డం వెంకటచారి, మాజి మండల కార్యదర్శి తంగెలపల్లి వెంకన్న,గడ్డం గోపాల్, ఏ.ఐ.టి.యు.సి నాయకులు తోగూటి కూమర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: