మన్యం న్యూస్,పినపాక:
రైతులు రుణాలు సకాలంలోరెన్యూవల్ చేసుకోవాలని ఏడుళ్ళ బయ్యారం ఎస్ బీ ఐ బ్రాంచి ఫీల్డ్ ఆఫీసర్ వేణు గోపాల్ అన్నారు. ఆయన పినపాక మండలం సీతంపేట పంచాయతీ కార్యాలయంలో రైతులకు శుక్రవారం వ్యవసాయ ఋణాలపై అవగాహన కల్పించారు. రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతులు ప్రతి సంవత్సరం బ్యాంకులో పొందిన వ్యవసాయ రుణాలను క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని అన్నారు. దీనితో ప్రభుత్వం అందించే వడ్డీ సబ్సిడీకి అర్హులవుతారని అన్నారు. కొంతమంది రైతులు సంవత్సరాల తరబడి బ్యాంకుకు రాకపోవడం మూలంగావారిపై అధిక వడ్డీ బారం పడుతుందని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు . రుణమాఫీకి ,రెన్యువల్స్ కి ఎలాంటి సంబంధం లేదని రైతులు అపోహలు వీడాలన్నారు. సంవత్సరంలో ఒకసారి రెన్యువల్ చేసుకుంటే మిగతా సమయంలో ఆయా ఖాతాలలో నగదు లావాదేవీలు జరిపిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. రైతులు పూర్తి వివరాలకు ఏడూళ్ళ బయ్యారం ఎస్ బి ఐ బ్రాంచ్ లో సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది ముత్తయ్య పాల్గొన్నారు.
Post A Comment: