మన్యం న్యూస్ : జూలూరుపాడు, అక్టోబర్ 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు భార్య మూడు వీరమ్మ (48) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. వారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, మూడు వీరమ్మ అనారోగ్యంతో గత వారం రోజులుగా కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతి చెందారని తెలిపారు. మరణ వార్త తెలుసుకున్న వైరా మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ వీరమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల లేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరితోపాటు ఏన్కూర్ జడ్పిటిసి బాదావత్ బుజ్జి, బాలాజీ, జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు చావా వెంకటరామారావు, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుద్దుకూరి నాగేశ్వరరావు, నిమ్మటూరి కనకయ్య, బానోతు చందర్, మాలోతు నరసింహారావు, గుమ్మడి మహేష్ లు వీరమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Navigation
Post A Comment: