CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారత కమ్యూనిస్టు పార్టీ 24 వ జాతీయ మహాసభలను జయప్రదం చెయ్యండి-మండల పార్టీ కార్యదర్శి ఎస్కే దస్తగిరి

Share it:


 దమ్మపేట:మన్యం న్యూస్ :(అక్టోంబర్ 04): 

భారత కమ్యూనిస్టు పార్టీ 24 జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ కార్యాలయం వద్ద డోరు పోస్టర్ ఆవిష్కరణ చేసారు.ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి ఎస్కే దస్తగిరి మాట్లాడుతూ,ఘనమైన చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీ అని 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే బహిరంగ మహాసభలను జయప్రదం చేయాలని, కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు. పేదవాళ్ళకి అండగా ఉండి ఎన్నో పోరాటాలకు సారథ్యం వహించిన ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో,వారి ఆశయా సాధన కోసం మనందరం పనిచేయాలని, సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని, కమ్యూనిజం అజేయమని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుక్కలకుంట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, మహిళా కార్యదర్శి జానీ బేగం, ఏఐటీయూసీ కార్యదర్శి  బెజవాడ రాము,ఎఐటియుసి నాయకులు దొంగ లక్ష్మీనారాయణ, రాపోలు శివన్నారాయణ,నక్క నాగమణి,నల్ల ప్రసాద్,వీరలక్ష్మి,కూరం ప్రసాద్,గాజు బోయిన కృష్ణవేణి,సీత,తుపాకుల శాంతి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: