మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, రామాయణంను రమ్యంగా రచించిన ఆదికవి వాల్మీకి అని, సత్ పరిపాలనకు ఆదర్శం వాల్మీకి రచించిన రామాయణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఎంపీటీసీ సత్యం, సర్పంచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: